ట్రస్టు కార్యక్రమాలు – వృద్ధాశ్రమములు నిర్మించి నిర్వహించుట, ప్రతిభావంతులైన పేద విద్యార్థుల పై చదువులకు ఉపకార వేతనములు అందజేయుట, వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిని సన్మానించుట.
ప్రస్తుతం ఈ వృద్ధాశ్రమంలో 30 మంది స్త్రీ పురుషులు ఆశ్రయం పొందుతున్నారు. నూతన కార్య వర్గం మొదటి సమావేశంలో ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. పండుగ, పర్వ దినాలలో, పుట్టినరోజు, పెళ్ళిరోజులలో, పెద్దవారు చనిపోయిన రోజులలో పదిమందికి భోజనాలు పెట్టాలనుకునేవాళ్ల సౌలభ్యం కోసం రూ. 1500/ -లు చెల్లిస్తే ఒక పూట భోజనము వారి పేరు మీద పెట్టటం జరుగుతుుంది. లేదా రూ. 10,000/-లు డిపాజిట్ చేస్తే ప్రతి సంవత్సరము వారు చెప్పిన తేదీనాడు వారి పేరు మీద భోజన వసతి కల్పింపబడుతోోంది. దీనికి మందచి స్పందన వచ్చింది. వస్థాపక ట్రస్టీ కోనేరు సుబ్బయ్య లక్ష రూపాయలకు పైగా కుటుంబ సభ్యులు పేర జమ చేశారు. విశాఖ పట్టణం విశ్రాంత డిప్యూటీ ట్రాన్ ఫోర్ట్ కమీషనర్ కోనేరు సాాంబశివరావు, కో-ఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ గా పదవీ విరమణ చేసిన కోనేరు గంగాజలం, (స్వర్గీయ బసవారావు గారి భార్య) మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చినారు.