గోసాల వాస్తవ్యులు కోనేరు నాగేశ్వరరావు విజయకుమారి దంపతులకు ఇద్దరు సంతానము – రమేష్, మోహన్. విధి వైపరీత్యమున 1990లో ఆరునెలల వ్యవధిలో ఆ పిల్లలు ఇద్దరు దివంగతులయ్యారు. వారి 29 సెంట్ల నివాసస్థలాన్ని కోనేరు ఛారిటబుల్ ట్రస్టుకు 2004వ సంవత్సరంలో వారి పిల్లల స్మృత్యర్థం దానం చేశారు. గ్రామానికి దగ్గరగా ఉన్న ఈ స్థలాన్ని ఎలా అభివృద్ధి చేయాలని ఏర్పాటు చేసిన సమావేశంలో విశ్రాంత ఉపాధ్యాయులు పర్వతనేని రాజారావు రూ.50,000/- వృద్ధాశ్రమ నిర్మాణానికి విరాళము ప్రకటిించి అందరినీ ఉత్తేజ పరిచారు.
29 సెంట్ల స్థలము ఇవ్వటమే కాకుుండా, భవన నిర్మాణంలోనూ, వృద్ధాశ్రమ దైనందిన నిర్వహణలోను పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్న నాగేశ్వరరావు, విజయకుమారి దంప తుల సేవలు వెలకట్టలేనివి. ఆహ్లాదకరమైన ప్రశాాంత వాతావరణంలో పచ్చ్చని పొలాల ప్రక్కన శుచిగా పౌష్టిక ఆహారాన్ని నియమిత వేళల్లో అందిస్తూ జీవన సంధ్యలో వృద్ధుల జీవితం సాఫీగా ఒడిదుడుకులు, ఒత్తిళ్లు లేకుుండా వృద్ధాశ్రమ నిర్వహణ, నడుపుటలో కోనేరు కోటేశ్వరరావు, సత్యమోహన్, స్థల దాతలు నా గేశ్వరరావు దంపతుల కృషి వెలకట్ట లేనిది.
